Header Banner

గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వాడుతుంటే అలర్ట్.. రూల్స్ మారుతున్నాయి! 50 సార్ల వరకు మాత్రమే..

  Tue Jun 10, 2025 13:59        Business

2024 ఆగస్టు 1 నుంచి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తమ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్ (API) వాడకానికి సంబంధించి కొత్త నిబంధనలు అమలు చేయనుంది. తాజా రిపోర్టుల ప్రకారం, ఈ సాంకేతిక మార్పులు ఆగస్టు నుండి అమల్లోకి వస్తాయి. ఈ మార్పుల ప్రభావం నేరుగా యూపీఐ ఉపయోగించే వినియోగదారులపై పడే అవకాశం ఉంది. ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ మార్పుల ప్రధాన ఉద్దేశ్యం UPI సిస్టమ్‌పై పడుతున్న భారాన్ని తగ్గించడమే. దీనివల్ల, యూపీఐ యాప్ ద్వారా బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేయడంపై కూడా పరిమితి విధించబడుతుంది. నిర్దేశించిన లిమిట్‌ కంటే ఎక్కువసార్లు బ్యాలెన్స్ చెక్‌ చేయలేరు. అలాగే, మీరు సెట్‌ చేసిన ఆటోపేమెంట్ విధానాల్లోనూ మార్పులు చోటు చేసుకుంటాయి. ఇక ఈ మార్పుల గురించి వివరంగా తెలుసుకుందాం. UPI లావాదేవీల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నట్లు రిపోర్ట్ చెబుతోంది. ప్రస్తుతం ప్రతి నెల సుమారు 16 బిలియన్‌ లావాదేవీలు ప్రాసెస్‌ అవుతున్నాయి. ఈ భారీ ట్రాఫిక్‌ వల్ల UPI సిస్టమ్‌పై బాగా లోడ్‌ పడుతోంది. తాజాగా కొన్ని బ్యాంకులు ఈ సిస్టమ్‌ను దుర్వినియోగం చేస్తున్నాయని కేసులు వెలుగులోకి వచ్చాయి. అలాగే కొన్ని సాంకేతిక లోపాలు కూడా బయటపడ్డాయి.

 

ఇది కూడా చదవండి: ప్రాక్టికల్ నైపుణ్యాలతో మెరుగైన ఉద్యోగం! ఇంజినీర్లకు స్పెషల్ ఛాన్స్! అస్సలు మిస్ అవొద్దు!

 

వీటిని ఎదుర్కొనడానికి ఆగస్టు 1 నుంచి కొన్ని కీలక మార్పులు తీసుకురావడం జరుగుతోంది. రిపోర్టు ప్రకారం, గత 2-3 నెలల్లో పలు సందర్భాల్లో UPI పేమెంట్ సిస్టమ్ డౌన్ అయింది. 2024 ఏప్రిల్ 12న సుమారు 5 గంటలపాటు యూపీఐ సర్వీసులు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇది గత 3 ఏళ్లలో జరిగింది అత్యంత కాలపరిమితి గల అవుటేజ్‌గా రికార్డయింది. చాలామంది నగదు వాడకాన్ని మానేసి యూపీఐపై ఆధారపడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో యూపీఐ పనిచేయకపోతే ప్రజలు ఎంతటి ఇబ్బందులకు గురవుతారో ఈ సంఘటన చూపించింది. అందుకే కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. రిపోర్టు ప్రకారం, యూపీఐ లావాదేవీల పరిధి ఎంతగా పెరిగిందంటే, చిన్నచిన్న ఆటంకాలే లక్షల మంది వినియోగదారులకు ఇబ్బందిగా మారుతాయి. అంచనాల ప్రకారం, ప్రతి సెకనుకు 7 వేల లావాదేవీలు యూపీఐ ద్వారా ప్రాసెస్ అవుతున్నాయి. ఒక నిమిషం పాటు యూపీఐ డౌన్ అయితే దాని ప్రభావం సుమారు 4 లక్షల మందిపై పడుతుంది. 10 నిమిషాలు డౌన్ అయితే 40 లక్షల మందికి ప్రాబ్లమ్. ప్రస్తుతం యూపీఐ వినియోగదారుల సంఖ్య 40 కోట్లకు పైగానే ఉన్నట్లు తెలుస్తోంది.

 

ఇది కూడా చదవండి: తస్మా జాగ్రత్త.. ఇలాంటి మొక్కలు మీ ఇంటి చుట్టుపక్కల ఉన్నాయా! పాములను ఆకర్షించే 7 మొక్కలు..

 

తాజా పరిశీలనల ప్రకారం, యూపీఐ సిస్టమ్ డౌన్ కావడానికి ప్రధాన కారణం API రిక్వెస్ట్‌లు అధికంగా ఉండటమే. 2024 మార్చి, ఏప్రిల్‌లో ‘చెక్ ట్రాన్సాక్షన్’ API రిక్వెస్ట్‌లు గణనీయంగా పెరిగి, సర్వీస్‌పై ప్రభావం చూపించాయి. రిపోర్టు ప్రకారం, బ్యాంకులు ఈ విషయం పై నిబంధనలు పాటించాల్సి ఉండగా, కొన్ని పాటించకపోయాయి. NPCI అన్ని బ్యాంకులు మరియు పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్స్‌ (PSPs), అంటే ఫోన్ పే, పేటీఎం, గూగుల్ పే వంటి యాప్‌లకు ఒక ఆదేశం జారీ చేసింది. ఇందులో 2024 జూలై 31లోపు అత్యధికంగా వాడుతున్న 10 APIలను నియంత్రించాలని సూచించింది. అంటే యూజర్లు యూపీఐ యాప్‌లో బ్యాలెన్స్‌ను తరచుగా చెక్ చేయడం ఇక సాధ్యం కాదు. రిపోర్ట్ ప్రకారం, రోజుకు గరిష్ఠంగా 50 సార్ల వరకు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేయడం అనుమతిస్తారు. ఇంకొక మార్పు ఏమిటంటే, ఆటోపేమెంట్ విధానాలు (ఉదాహరణకు SIPలు లేదా OTT ప్లాట్‌ఫారాల సభ్యత్వాల వంటి చెల్లింపులు) ఇకపై నాన్-పీక్స్ అవర్స్‌లో మాత్రమే ప్రాసెస్ అవుతాయి. నాన్-పీక్స్ అవర్స్ అంటే ఉదయం 10 గంటల ముందు, మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల మధ్య, లేదా రాత్రి 9:30 తర్వాత.

 

ఇది కూడా చదవండి: ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

పండగలాంటి వార్త.. ఆ రైల్వే స్టేషన్ కు ఆరు కొత్త రైల్వే లైన్లు! ఇక వారికి పండగే.. వేళల్లో ఉద్యోగాలు!

 

సజ్జలకు ఊహించని షాక్.. వెంటనే చర్యలు తీసుకోండి.. డీజీపీకి రఘురామ ఫిర్యాదు!

 

బాల‌య్య‌కు చంద్ర‌బాబు బ‌ర్త్‌డే విషెస్! సోష‌ల్ మీడియా వేదిక‌గా..

 

విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులో మరో ముందడుగు! మొదటి దశకు సుమారు..

 

జగన్ కు దిమ్మతిరిగే షాక్.. ఆ మాజీ మంత్రిపై మరో కేసు నమోదు! వైసీపీలో హైటెన్షన్..

 

కృష్ణంరాజు కాదు నికృష్ఠం రాజు.. అతను జర్నలిస్ట్ ముసుగేసుకున్న జగనిస్ట్! వారి బతుకులు రోడ్డుపాలవడం ఖాయం!

 

కాంగ్రెస్ మంత్రివర్గ విస్తరణ - కొత్త మంత్రులు వీరేనా? ఆ వర్గాల వారికే..

 

సీనియర్ నేత రాజీనామా.. టీడీపీకి గుడ్ బై చెప్పిన రాయలసీమ ముఖ్యనేత!

 

పార్టీలో చేరికలపై నేతలకు కీలక ఆదేశాలు జారీ! కేంద్ర కార్యాలయానికి..

 

జగన్ పెంచి పోషించిన మత్తు భూతం రాష్ట్రాన్ని వదల్లేదు! తిరుపతిలో స్థానికులు ఆగ్రహం వ్యక్తం!

 

8 జిల్లాలతో పాటు విశాఖ ఆర్థిక ప్రాంతం.. లక్ష ఎకరాల్లో ప్రాజెక్టులు.. అదిరిపోయే బాబు ప్లాన్!

 

అదిరిపోయే శుభవార్త: ఏపీలో భారీగా నిల్వలు.. తవ్వుతుంటే కిలోలకి కిలోలే బయటికి వస్తుంది!

 

ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారు, దరఖాస్తు చేసుకోండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #UPIPayment #Moneytransfer #MoneyTransferProblem #Payment #OnlinePayment #OnlinePaymentProblem #NewRules #Autopayment #Limitis #UPIChanges